కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర

Spread the love

కర్నూల్ జిల్లాలో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర

కర్నూలు: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది.ఇవాళ ఆదోని మండలం చాగి గ్రామం నుంచి జోడో యాత్ర ప్రారంభం కానుంది.

ఈ ఉదయం 7 గంటలకు చాగి గ్రామం నుంచి మొదలు పెట్టి నారాయణపురం, డాణాపురం మీదుగా ఆదోని పట్టణం దగ్గరలో ఏర్పాటు చేసిన విశ్రాంతి శిబిరానికి చేరుకుంటారు. ముందుగానే అనుమతి తీసుకున్న వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతారు.

అనంతరం ఇక్కడే పాత్రికేయుల సమావేశంలో రాహుల్‌ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి ఆదోని పట్టణ వీధులు, బైచిగేరి మీదుగా ఆరేకల్లు వరకు సాగిస్తారు. 6:30 గంటలకు ఆ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి ఎమ్మిగనూరు మండలం బనవాసిలో రాహుల్ బస చేయనున్నారు.

Related Posts

You cannot copy content of this page