ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

Spread the love

Republic day celebrations under the auspices of the Unity Press Club

ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సాక్షిత న్యూస్ అశ్వరావుపేట ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉదయరాఘవేంద్ర జెండాను ఆవిష్కరించడం జరిగింది. వారితో పాటుగా ప్రధాన కార్యదర్శి పెనుగొండ సత్యనారాయణ కోశాధికారి జుజ్జారపు రాంబాబు, ఉపాధ్యక్షులు కూన చిన్నారావు నార్లపాటి సోమేశ్వరరావు సహాయ కార్యదర్శి ముల్లగిరి రమేష్ మద్దు రవికుమార్ నియోజకవర్గ రిపోర్టర్లు గన్నవరపు రాజారావు ,శివశంకర్, దొంగ వెంకట్, గోళ్ళ నవీన్ కుమార్, దాది చంటి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజు అని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకొని జరుపుకునే జాతీయ పండుగ కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ వేడుకలను ఘనంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో కూడా గణతంత్ర దినోత్సవాన్ని అంగ రంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేశారు . ఈ గణతంత్ర దినోత్సవం1950 జనవరి 26న రోజున ఘనంగా జరుపుకునే వేడుకగా తెలియజేశారు.
సాక్షిత న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గ రిపోర్టర్ దొంగ వెంకట్)

Related Posts

You cannot copy content of this page