పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బన్సీలాల్ పేట

Spread the love

Renovated and greatly developed by Bansilal Peta

సాక్షిత : పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బన్సీలాల్ పేట లోని మెట్ల బావిని ఈ నెల 5 వ తేదీన మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మంత్రి శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్ పేట లోని మెట్ల బావి, పరిసరాలలో మున్సిపల్ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. మెట్ల బావి, నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్ ను పరిశీలించారు.

ప్రారంభోత్సవం రోజు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పురాతన కట్టడాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు

. అందులో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రి KTR గారి ప్రత్యేక చొరవతో HMDA ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట మెట్ల బావి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ బావిని నిజాం కాలంలో అప్పటి స్థానిక ప్రజల త్రాగునీటి అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పారు. అప్పట్లో ఈ బావిని నాగన్న కుంటగా పిలిచే వారని ఇక్కడ ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తుందని వివరించారు.

అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందు ఈ బావి పూర్తిగా చెత్త చెదారాలతో నిండిపోయిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పూడిక తొలగింపు చేయగా 500 టన్నుల కు పైగా ఉన్నదని, దీనిని తరలించడానికి 6 నెలల సమయం పట్టిందని చెప్పారు. పూడిక తొలగించిన తర్వాత నీటితో కలకళలాడుతుందని చెప్పారు.

బావి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచన తో బావి పరిసరాలలో అనేక అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. నగరంలో 44 బావులు ఉండగా 6 బావుల అభివృద్ధి, పరిరక్షణ పనులు చేపట్టినట్లు చెప్పారు.

వాటిలో ముందుగా పనులు పూర్తి చేసుకొని బన్సీలాల్ పేట మెట్ల బావి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సాహె స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు కల్పన, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, SE అనీల్ రాజ్, EE సుదర్శన్, వాటర్ వర్క్స్ GM రమణా రెడ్డి, ఎలెక్ట్రికల్ DE శ్రీధర్, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్ రావు, స్ట్రీట్ లైట్ DE ప్రసన్న తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page