SAKSHITHA NEWS

మతసామరస్యానికి ప్రతీక రంజాన్

మైలవరంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 22.4.2023.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

మైలవరంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారికి ఆత్మీయ స్వాగతం పలికారు.

శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులు పవిత్ర రంజాన్‌ మాసాన్ని ఎంతో నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారని పేర్కొన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పండుగ అన్నారు. పవిత్రతకు, త్యాగానికి, సోదరభావానికి చిహ్నమైన రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అల్లాహ్ దయతో అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.


SAKSHITHA NEWS