గంగా విలాస్ యాత్రను ప్రారంభించిన ప్రధాని మోదీ

Spread the love

Prime Minister Modi started the Ganga Vilas Yatra

గంగా విలాస్ యాత్రను ప్రారంభించిన ప్రధాని మోదీ… ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూజ్ టూర్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ టూర్ అయిన గంగా విలాస్ యాత్రను ప్రధాన మంత్రి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ టూర్ 51 రోజుల పాటు కొనసాగుతుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాత్రను ప్రారంభించారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూజ్ టూర్ (River Cruise Tour) ఇది. ఈ టూర్ వారణాసిలో ప్రారంభం అవుతుంది.

51 రోజుల పాటు యాత్ర కొనసాగి దిబ్రుగఢ్‌లో టూర్ ముగుస్తుంది. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్ సాగుతుంది. క్రూజ్ సుమారు 4,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో బంగ్లాదేశ్‌లోనే 1,100 కిలోమీటర్లు కవర్ అవుతుంది. 51 రోజుల యాత్రలో 50 టూరిస్ట్ స్పాట్స్ కవర్ అవుతాయి.

గంగా విలాస్ యాత్రలో మొదటి బ్యాచ్‌లో స్విట్జర్లాండ్ పర్యాటకులు ఉంటారు. పర్యాటకులు ప్రసిద్ధ గంగా హారతిని కూడా చూడొచ్చు. బౌద్ధులు ఆరాధించే సారనాథ్, అస్సాంలోని వైష్ణవ సంస్కృతికి కేంద్రమైన మజులి, సుందర్‌బన్స్, కాజిరంగా జాతీయ ఉద్యానవనం సందర్శించవచ్చు.

Related Posts

You cannot copy content of this page