SAKSHITHA NEWS

నేడు పొంగులేటి పోడు రైతు భరోసా ర్యాలీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం లోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శనివారం పోడు రైతు భరోసా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేస్తారని తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో వందలాది మంది పోడు రైతు సోదరులు, నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.


SAKSHITHA NEWS