పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి.

Spread the love

Police should always be available to people.

పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. వైరా ఏసిపి రెహమాన్

మధిర టౌన్ పోలీస్ స్టేషన్ , సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఏసిపి.

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మారుతున్న కాలానికి అనుగుణంగా కేసులు పరిష్కరించాలని వైరా ఏసిపి రెహమాన్ పోలీసులకు సూచించారు.

వార్షిక తనిఖీలలో భాగంగా వైరా ఏసిపి మధిర టౌన్ పోలీస్ స్టేషన్ మరియు మధిర సిఐ ఆఫీసును తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పలు రికార్డులు ఫైళ్లను మరియు కేసులను పరిశీలించి తగు సూచనలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి కొన్ని సూచనలు చేయడం జరిగింది.

సిబ్బంది తో మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం ఎన్నో కఠిన సవాళ్లు ఉన్నాయని తదనుగుణంగా మనం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ విధంగా డుటీ చేయవలెనో వివరించి అదేవిధంగా వారి యొక్క పనితీరును సమీక్షించడం జరిగింది. వైరా ఏసిపి తో పాటు మధిర సీఐ మురళి సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page

Compare