గుండెపోటుతో పిసిఆర్ ఎస్సై రాంబాబు మృతి

Spread the love

PCR CSI Rambabu died of heart attack

గుండెపోటుతో పిసిఆర్ ఎస్సై రాంబాబు మృతి

కృష్ణా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న ఎస్ఐ మేడిశెట్టి రాంబాబు (59) కన్నుమూశారు.

1983లో కానిస్టేబుల్ గా ఎంపికైన రాంబాబు హెడ్ కానిస్టేబుల్ గా, ఏఎస్ఐగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు.

రెండేళ్ల క్రితం ఎస్సైగా పదోన్నతి పొందిన రాంబాబు అవనిగడ్డ ఎస్ బి ఎస్సైగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా ఇటీవల పిసిఆర్ కు బదిలీపై వచ్చారు.

6.30 గంటల సమయంలో రాంబాబుకు గుండెపోటు రావడంతో హుటాహుటి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.

అప్పటికే రాంబాబు మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు.

రాంబాబు మృతి పట్ల జిల్లా ఎస్పీ బీజాషువా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

రాంబాబు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పడంతో పాటు దహన సంస్కరాలకు అయ్యే ఖర్చును పోలీసు శాఖ తరపున వెంటనే అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page