గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

Spread the love

Our government’s program for Gadapa Gadapa

కర్నూలు నగరంలోని 9వ వార్డ్ 22వ సచివాలయ పరిధిలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ టీ. పుల్లమ్మ మరియు స్థానిక వార్డ్ నాయకులు

కర్నూలు నగరం లోని 9వార్డు లో గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడప తిరుగుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది వార్డులో ప్రజలు చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని అక్కడే ఉన్న అధికారులకు తెలిపి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు…

ఈ సందర్భంగా కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం నాయకులు ఓట్ల కోసం మాత్రమే ప్రజల వద్దకు రావడం జరిగేదని గెలిచిన తర్వాత పట్టించుకునే పాపను పోలేదన్నారు వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

అన్ని అన్నారు అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందించే విధంగా పరిపాలన సాగిస్తున్నారు ప్రజలు కూడా సంక్షేమ పథకాల వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారని గడప గడప కార్యక్రమంలో ప్రజలు చూపుతున్న ఆదర అభిమానానికి ఎంతో సంతోషంగా ఉందన్నారు వచ్చే 2024 ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేశారు…

ఈ కార్యక్రమం లో స్థానిక 9వ వార్డ్ కార్పొరేటర్ టీ. పుల్లమ్మ నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానిక వార్డు నాయకులు నవీన్ కుమార్, తబ్రేజ్, గోవింద్ రాజులు,సమీనా,నాజిమా,మెహబూబ్, యం.యం డిజిటల్ మెహబూబ్, రశేఖర్, సలాం భాయ్, అబ్దుల్లా, అమీర్, కవిత, శోభ రాణి, అరుణ, వీమల, గౌస్ భాయ్,మరియు సచివాలయం సిబ్బంది,వాలంటీర్స్,మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, RP’s, OB’s అలాగే విద్యుత్ సిబ్బంది కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page