ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పై మునుగోడు లో మంత్రులు కేటీఆర్,

Spread the love

On the development of joint Nalgonda district, Ministers KTR,

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పై మునుగోడు లో మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, దయాకర్ రావు, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.


సాక్షిత : మునుగోడును‌ గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెళ్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు
గతంలో ఎన్నడూ లేనంతగా నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదు
మీరు ఇంతలా ఆశీర్వదించారు కాబట్టే కేసీఆర్ ఆదేశానుసారం ఇక్కడకి వచ్చాం
మీరు గెలిపించింది కూసుకుంట్ల ను కాదు మా అందరినీ

రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం

గతంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు

కేసీఆర్ వచ్చాక నల్లగొండ, సూర్యాపేట లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి క్లాసులు కూడా ప్రారంభించాం

దామరచర్ల లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కారణంగా రాబోయే వందేళ్ల వరకు విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టు నిర్మిస్తున్నాం

అక్కడే సోలర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తాం

తెలంగాణలో అత్యథికంగా వరి పండించేది నల్లగొండ జిల్లా

జిల్లాలో సాగు విస్తీర్ణం కేవలం కేసీఆర్ ప్రోత్సాహం కారణంగానే పెరిగింది

తిరుమల స్థాయిలో యాదాద్రి కి భక్తులు తరలివస్తున్నారు.

దండు మల్కాపురంలో 540 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించి పారిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం

ప్రజలు టీఆర్ఎస్ ను ఏవిధంగా గుండెళ్లో పెట్టుకుని 12నియోజకవర్గాల్లో గెలిపించారో మిమ్మల్ని అలానే గుండెళ్లో పెట్టుకుంటాం

రాబోయే ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో ఇవాళ సమీక్ష చేశాం

రూ. 402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతాం

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం

మున్సిపాలిటీ ల్లో 334 కోట్లు ఖర్చు చేస్తాం

గిరిజనుల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం

మొత్తం ఆరు, ఏడు నెలల్లో ఈ‌నాలుగు డిపార్ట్మెంట్ ల పరిధిలో రూ. 1544 కోట్లు కేటాయించి ఖర్చు చేయబోతున్నాం

మునుగోడులో వంద కోట్లతో రహదారుల విస్తరణ చేస్తాం

పంచాయితీ రాజ్ శాఖ ద్వారా రూ. 174 కోట్లు కేటాయిస్తున్నాం

చండూరు మున్సిపాలిటీ కి రూ. 30 కోట్లు ,చౌటుప్పల్ మున్సిపాలిటీ లో రూ. 50 కోట్లు కేటాయిస్తున్నాం

గిరిజనుల కోసం అభివృద్ధి నిధులు కేటాయిస్తాం

ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం ఎనిమిది కోట్లు కేటాయిస్తాం

నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తాం

దండు మల్కాపురం లో వంద ఎకరాల్లో టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తాం

దీని ద్వారా పది వేల మందికి ఉపాధి వస్తుంది

చండూరుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తాం

నారాయణ పురంలో గిరిజన గురుకుల పాఠశాల, కోటి రూపాయలతో సేవాలాల్ బంజారా భవన్ ఏర్పాటు చేస్తాం

నాలుగు హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం

Related Posts

You cannot copy content of this page

Compare