ప్రగతి పథంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

Spread the love


Nizampet Municipal Corporation on the path of progress…

ప్రగతి పథంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

కౌన్సిల్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రగతి నివేదిక‘ ఆవిష్కరణ…

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఎన్నికై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నగర్ లోని కేజీఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ‘ప్రగతి నివేదిక ఆవిష్కరణ‘లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. గతంతో పోల్చితే అనేక సమస్యలను అధిగమించామని చెప్పారు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు ప్రజా ప్రతినిధులంతా కృషి చేయాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సమస్యలకు పరిష్కారం చూపి వారి ఆదరణ పొందాలన్నారు. నిధులకు కొరత లేకుండా రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలతో ఆదర్శవంతమైన కార్పొరేషన్ గా నిజాంపేట్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page