నెల్లూరు జిల్లా న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

Spread the love

నెల్లూరు జిల్లా న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

సాక్షిత : జ‌న విజ్ఞాన వేదిక క‌న్వీన‌ర్, నెల్లూరు హాస్పిటల్స్ అధినేత డాక్ట‌ర్ విజ‌య్ కుమార్ హ‌త్య కేసులో నిందితుల‌కు నెల్లూరు జిల్లా న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ హ‌త్య కేసులో ఐదుమంది దోషుల‌కు జీవిత ఖైదు విధించింది. ఈ హత్య కేసులో మృతుడు విజయకుమార్ భార్య ఉష, కుమారుడు సుందరయ్య తో పాటు మరో ఐదుగురు నిందితులను అప్ప‌ట్లో అరెస్ట్ చేశారు. ఈ కేసు పూర్తి విచార‌ణ అనంత‌రం నిందితులైన ఉష‌, సుంద‌ర్‌, శ్రీధ‌ర్ తో పాటు ఇద్ద‌రు కిరాయి హంత‌కుల‌కు జీవిత ఖైదు విధిస్తున్న‌ట్లు నెల్లూరు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. అప్ప‌ట్లో డాక్ట‌ర్ విజ‌య్ కుమార్ హ‌త్య నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page