నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొని రక్తదానo

Spread the love

Nara Lokesh was the chief guest at the birthday celebrations and donated blood

నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మన్నవ మోహనకృష్ణ

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష జన్మదినం సందర్భంగా గుంటూరు నగరంలోని 39వ డివిజన్ లో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ.

ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన గుంటూరు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, గుంటూరు తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ బాజి లను మోహనకృష్ణ అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనటం జరిగింది. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి మన్నవ మోహనకృష్ణ ప్రశంసపత్రాలు అందజేసి వారిని ప్రశంసించారు.

ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు రథసారధి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page