విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలి.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో హైకోర్టు ఇంటీరియం ఆదేశాల మేరకు సస్పెన్షన్ లో ఉన్న ఓరుగంటి కృష్ణయ్యకు టెక్నీకల్ అసిస్టెంట్ గా కూసుమంచి లో పోస్టింగ్ ఇస్తూ జారీచేసిన ఉత్తర్వులను అందజేశారు. వివరాల్లోకి వెళితే, ఓరుగంటి కృష్ణయ్య డిఆర్డీఏ లో టెక్నీకల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, వ్యక్తిగత కారణంతో 2014 లో సస్పెండ్ అయినారు. అభ్యర్థి హైకోర్టు కు వెళ్లి సస్పెన్షన్ విషయంలో కేసు వేయగా, హైకోర్టు నుండి అభ్యర్థిని ఉద్యోగంలో కొనసాగించమని ఇంటీరియం ఉత్తర్వులు జారిచేయగా, అట్టి ఉత్తర్వులను అభ్యర్థి సోమవారం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు అందజేసి, న్యాయం చేయగలందులకు కోరగా, కలెక్టర్ వెంటనే స్పందించి నియామక ఉత్తర్వులు జారీచేసి గ్రీవెన్స్ లోనే అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్వో శిరీష, డిఆర్డీవో విద్యాచందన అధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page