మంత్రి ఎర్రబెల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్

Spread the love

Mrs. Siktha Patnaik, the new collector who paid a courtesy call to Minister Errabelli

మంత్రి ఎర్రబెల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్

హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీమతి సిక్తా పట్నాయక్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

హనుమకొండ జిల్లా సమస్యలు – పరిష్కారాలపై మంత్రి వివరించారు.

జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ గా, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, నాయకులు – అధికారులతో సమన్వయం చేసుకుని వెళ్లాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page