ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి

Spread the love

ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి

ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

తిరుపతి పార్లమెంట్ పరిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎంపీ, ఎమ్యెల్యే ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేసారు. గ్రామస్థులకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు ఎంపీ గురుమూర్తి లోకా ఫౌండేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళేగా ఫౌండేషన్ అధినేత లోకేష్ దాసు నిర్మాణానికి సంసిద్ధత వ్యకతం చేసి నిర్మించిన వాటర్ ప్లాంట్ ని ఆయన చేతనే శాసనసభ్యులు ప్రారంభం చేయించారు. అలాగే గ్రామంలో కొత్తగా నిర్మించిన పోస్ట్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించి గ్రామానికి తపాలా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చివరగా గ్రామంలో రైతు ఉత్పత్తుల సంస్థ (ఎఫ్.పి.ఓ) భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ సహకారంతో మన్నసముద్రం గ్రామం ఒక ఆదర్శ గ్రామం లాగ రూపుదిద్దుకొంటుందని ఆయన కొనియాడారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మన శాసనసభ్యులు బియ్యపు మధుసూధన రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరుస్తూ మధుసూదన్ రెడ్డి ని మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో లోకా ఫౌండేషన్లో అధినేత లోకేష్ దాసు, సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్ ఆఫీస్ (తిరుపతి), ఏర్పేడు మండల ఇంచార్జి కిషోర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ నాగార్జున రెడ్డి, వైస్ ఎంపీపీ జనార్దన్, సర్పంచ్ వనజమ్మ, ఎఫ్.పి.ఓ. సిబిబిఓ పీవీ రత్నం, యూనియన్ బ్యాంకు మేనేజర్ మనోజ్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ సురేష్ మరియు మండల వైసిపి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page