
ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, సంఘ సభ్యులు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అదే విధంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న గణపతి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు…
