సుమారు 2.00 కోట్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే,

Spread the love
MLA, who attended the foundation stone laying program of about 2.00 crores.

సాక్షిత : సుమారు 2.00 కోట్ల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే,కార్పొరేటర్.తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాల ముఖ్యమయినది మన ఊరు మన బడి కార్యక్రమం.

ఈ కార్యక్రమం యొక్క ఉదేశ్యం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలలో మౌలిక సదుపాయాలు,డిజిటల్ క్లాస్ రూమ్,నూతన భవనాలు,నూతన క్లాస్ రూమ్ ను నిర్మించడమే.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ వినత మేరకు రామచంద్రపురం ఎస్సీ బస్తి లో ఉన్న ఎంపిపిఎస్(చిన్న స్కూల్) లో నూతన భవన నిర్మాణం మరియు అదనపు గదుల నిర్మాణం

కొరకు సుమారు 123.82 లక్షల రూపాయలతో శంకుస్థాపన చెయ్యడానికి స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచ్చేసి శంకుస్థాపన చెయ్యడం జరిగింది.అనంతరం ఓల్డ్ రామచంద్రపురం లో ఉన్న జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకు 57.66 లక్షల రూపాయిల పనుల శంకుస్థాపన చెయ్యడం జరిగింది.

వారితో సహచర కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్,ఎంఈఓ జెమిని కుమారి,హెడ్ మాస్టర్ ప్రతాప్ రెడ్డి,కుమార్ గౌడ్,సోహైల్,మఖ్బుల్,చాంద్,ఐలేష్,అబ్దుల్ గఫ్ఫార్,రాణి,ప్రీతీ గౌడ్,అప్పల భాస్కర్,సీఎం మల్లేష్,కిరణ్ గౌడ్,మహిళలు.

Related Posts

You cannot copy content of this page