జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Spread the love

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ..

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు… హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అన్నారు.

హుజూర్ నగర్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేయాలని, జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం పాటుగా ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, యూనియన్ అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు, యూనియన్ ప్రతినిధులు దాచేపల్లి దయాకర్ రెడ్డి, దేనమ కొండ శేషంరాజు, దేవరం రాంరెడ్డి, బసవోజు శ్రీనివాసచారి, కిత రామనాదం, దేవరం వెంకటరెడ్డి, కోమరాజు అంజయ్య, ఇట్టి మల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare