వైఎస్ఆర్ చేయూత 3వ విడత చెక్కు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ హనుమంతరావు

Spread the love

MLA RK MLC Hanumantha Rao participated in the 3rd installment check distribution program of YSR

వైఎస్ఆర్ చేయూత 3వ విడత చెక్కు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ హనుమంతరావు …

మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపం లో ఈ రోజు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ చేయూత 3వ విడత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ హనుమంతరావు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్నారని మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించబట్టే మహిళలకు పెద్ద ఎత్తున మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు…

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు లబ్ధిని చేకూరుస్తున్నారని అందులో భాగంగా 45 సంవత్సరాలు దాటిన మహిళల అభ్యున్నతి కోసం సొంత కుటుంబ సభ్యుని వలె సంవత్సరానికి 18,750 రూపాయలు అందిస్తున్నారని, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి వారి స్వయం ఉపాధి కొరకు పాటుపడుతున్నారని అన్నారు.

మంగళగిరి పట్టణ ప్రాంతం నందు 6485 మంది లబ్ధిదారులకు గాను 12,15,93,750.00 (12 కోట్ల 15 లక్షల 93 వేల 750 రూపాయలు) రూపాయల చెక్కును మహిళలకు ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు , కమిషనర్ శారదా దేవి అందజేశారు.

Related Posts

You cannot copy content of this page