SAKSHITHA NEWS

సాక్షిత : పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి డెకరేషన్స్, టెంట్ హౌస్ అండ్ బాంబు మర్చంట్ యజమాని, దయన్న అభిమాని “రేపాల.అశోక్” ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి.దయాకర్ రావు * ప్రారంభించారు..

మానవ సేవే మాధవ సేవా అని, చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అభిమానిని అభినందించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS