SAKSHITHA NEWS

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా యూత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కాలనీ లో సీసీ రోడ్లు వేయాలని,డ్రైనేజి వ్యవస్థ ను మరియు మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకు రావడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ యూత్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో పాదయాత్ర చేయడం జరిగినది అని , యూత్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, సీసీ రోడ్ల ను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, కాలనీ లో మంచి వాతావరణం కల్పిస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు , మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని, సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి , AE ప్రతాప్
మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app