డోన్ ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం కార్యక్రమం

Spread the love

Mandal general meeting program at Doan MPDO office

సాక్షిత నంద్యాల జిల్లా

డోన్ మండలంలోని గ్రామాల, గౌరవనీయులైన పెద్దలు ఆర్థిక శాఖ మంత్రి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి, లక్ష్యంగా డోన్ ఎంపీపీ రేగటి శ్రీ రాజశేఖర్ రెడ్డి, డోన్ ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ బద్దల.రాజ్ కుమార్ డోన్ ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సర్వసభ్య సమావేశానికి గ్రామాలకు సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు సర్పంచ్ ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఈకార్యక్రమంలో డోన్ ఎంపీపీ , శ్రీ రేగటి శ్రీ రాజశేఖర్ రెడ్డి జడ్పీటీసీ బద్దల.రాజ్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు మాట్లాడుతూ డోన్ మండలం పరిధిలోని గ్రామాలలోని ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి అని, అదేవిధంగా సచివాలయ పరిధిలోని అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ పథకాలు అందజేయండి

అని విద్య, వైద్యం,అగ్రికల్చర్ ఆర్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ల సమస్యల పైన వారు మాట్లాడారు, గ్రామాలలోని కాలువలు, సిమెంటు రోడ్లు గా నాడు నేడు కింద పాఠశాలలు ప్రహరీ గోడలు పాఠశాల లెట్రిన్ బాత్రూం అభివృద్ధి సమస్యల పైన వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, ఆర్టికల్చర్, అగ్రికల్చర్, విద్య, వైద్యం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page