ఐతం వెంకటేశ్వరరావు అంతిమయాత్రలో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క

Spread the love

Mallu Bhatti Vikramarka, who participated in the funeral procession of Aitham Venkateswara Rao

ఐతం వెంకటేశ్వరరావు అంతిమయాత్రలో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

స్వాతంత్ర సమరయోధులు తామర పత్ర గ్రహీత కాంగ్రెస్ నాయకులు ఐతం వెంకటేశ్వరరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందిన మధిర శాసనసభ్యులు, శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకొని ఐతం వెంకటేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు.

ఐతం వెంకటేశ్వరరావు తన గురు సమానులని మొదటి నుంచి తనకు తోడుగా ఉన్నారని జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఐతం వెంకటేశ్వరరావు అంతిమయాత్రలో పాల్గొని పాడెను మోసి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ఈ అంతిమయాత్రలో ఏ కే రామారావు, పొట్ల నాగేశ్వరరావు రాయల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, పుచ్చకాయల వీరభద్రం , మిక్కిలినేని నరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page