సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్తులను గెలిపిద్దాం

Spread the love


Let’s win the candidates supported by BJP in Sirisilla cess election

సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్తులను గెలిపిద్దాం – ఎల్లారెడ్డిపేటలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..


సాక్షిత : రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24 న జరగనున్న సిరిసిల్ల విధ్యుత్ సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించి సెస్ పై కాషాయ జెండా ఎగరేయాలని అన్నారు.

సిరిసిల్ల లో ముఖ్యమంత్రి పాల్గొన్న ఒక బహిరంగ సభలో విధ్యుత్ సరఫరా ఆగిపోతే సెస్ లో సన్నాసులు ఉన్నారని..వారి భరతం పడుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్… మళ్ళీ ఏ ముఖం పెట్టుకోని సన్నాసులకు ఓట్లు వేయాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో సెస్ లో ఉన్న సన్నాసుల భరతం ప్రజలే పడుతారని పేర్కొన్నారు.

పదిహేను ఏళ్లుగా సెస్ ని బీఆర్ఎస్ పార్టీ బ్రష్టు పట్టించిందని, బీఆర్ఎస్ నాయకులు సెస్ లో కోట్ల రూపాయల అవినీతి చేసారని ఆరోపించారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పేట్ బీజేపి అభ్యర్థి గుండాటి వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు సురభి నవీన్ రావ్, బుగ్గా రెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page