కుప్పం పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పక్కనే కూర్చుని ఒకే విమానంలో ప్రయాణిస్తున్న శిష్ట్లా లోహిత్

Spread the love

కుప్పం పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పక్కనే కూర్చుని ఒకే విమానంలో ప్రయాణిస్తున్న శిష్ట్లా లోహిత్

  • శిష్ట్లా లోహిత్ ను వెంటబెట్టుకుని కుప్పం పర్యటనకు బయలుదేరి వెళ్లిన చంద్రబాబు
  • హైదరాబాద్ నుండి బెంగళూరుకు పయనం
  • రోడ్డు మార్గాన కుప్పం చేరుకున్న చంద్రబాబు, శిష్ట్లా లోహిత్
  • శ్రీకాళహస్తి నుండి భారీ కాన్వాయ్ ను సిద్ధం చేసిన శిష్ట్లా లోహిత్

……………………………………………………………………
సాక్షిత హైదరాబాద్, : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ను బుధవారం వెంటబెట్టుకుని వెళ్లారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో బయలుదేరిన చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ ప్రయాణించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన వీరు కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శిష్ట్లా లోహిత్ కూడా కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి పలు కార్యక్రమాలను రూపొందించనున్నారు. చంద్రబాబు సమక్షంలోనే కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించనున్నారు. అలాగే ఆయా సంక్షేమ కార్యక్రమాలపై కార్యకర్తల్లో అవగాహన పెంచడంతోపాటు వాటిని వినియోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నారు. కుప్పం పర్యటనకు చంద్రబాబు స్వయంగా శిష్ట్లా లోహిత్ ను వెంటబెట్టుకుని మరీ తీసుకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి కార్యకర్తల సంక్షేమానికి చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పెద్దపీట వేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే శిష్ట్లా లోహిత్ సమర్ధతను దృష్టిలో పెట్టుకొని, ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్రస్థాయిలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవితో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. చంద్రబాబు ఏ జిల్లాలో పర్యటించినా శిష్ట్లా లోహిత్ వెన్నంటే ఉంటూ కార్యకర్తలు అందరికీ సంక్షేమాన్ని అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు తనవంతుగా ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం వంటి పబ్లిసిటీ కార్యక్రమాలతో అదరగొడుతున్నారు. చంద్రబాబు కూడా శిష్ట్లా లోహిత్ ను వేదిక పైకి పిలిచి కార్యకర్తల సంక్షేమంపై మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహంతో శిష్ట్లా లోహిత్
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కుప్పం పర్యటనలో పాల్గొనేందుకు చంద్రబాబుతో కలిసి వస్తున్న శిష్ట్లా లోహిత్, శ్రీకాళహస్తి నుండి భారీ కాన్వాయ్ ను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు చంద్రబాబు వెన్నంటే ఉంటూ కుప్పం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను శిష్ట్లా లోహిత్ విజయవంతం చేయనున్నారు.
ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ కుప్పం పర్యటనకు బయలుదేరిన నా ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ మోహన్ రెడ్డి పాలనను గద్దె దింపడానికి చంద్రబాబు చేస్తున్న పోరాటంలో తాను కూడా కలిసి పోరాడడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Related Posts

You cannot copy content of this page