కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

Spread the love

కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..
సాక్షిత మంచిర్యాల నియోజకవర్గం:

లక్షెట్టిపేట పట్టణంలోని,IB గెస్ట్ హౌస్ నందు 32 మంది కళ్యాణాలక్ష్మి లబ్దిదారులకు సుమారు 32,03,712 రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లను మగ పిల్లావానితో సమానంగా పెంచాలని అన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి తల్లి దండ్రులకు ఆడపిల్ల పెళ్ళి భారం కాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page