నర్సింగ్ నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం

Spread the love

నర్సింగ్ నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం


సాక్షిత : సైబరాబాద్ పోలీసు కమిషన్ రేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మొహముద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర .

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. 585 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించి పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని.. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులను అరికట్టడానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఇక ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తు తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని హోం మంత్రి మొహముద్ అలీ పేర్కొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page