శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Spread the love

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపుచేశారు.ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మ వార్లకు విశేష సమర్పణ చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తామని వివరించా రు. కాగా పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు…

Related Posts

You cannot copy content of this page