SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా దాతల సౌజన్యంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రజత(వెండి) కవచం ను దాతల సమక్షంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , దేవాలయం EO సత్యనారాయణ మరియు భక్తులతో కలిసి స్వామి వారి బహుకరించి ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో రజత కవచం ను అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని , రజత కవచం ను అందచేసిన దాతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో రజత ( వెండి) కవచం అందచేసిన దాతలు: 1 ప్రసాద్ – పద్మిని, 2.బాలు- మంజుల, 3.సాంబశివరావు- ఉషారాణి, 4.ఉమ శంకర్ – సుజాత మరియు నాయకులు KRK రాజు, రాగ ప్రసాద్, పోతుల రాజేందర్, శ్రీ హరి, పద్మ ,సాంబ శివ రెడ్డి,అప్పిరెడ్డి, కిరణ్ కుమార్, కడియాల శివ ,సుజాత, నిఖిల్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app