లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు

Spread the love

లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు

సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా

సైదాపూర్ /స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. గ్రామపంచాయతీ మైకు ద్వారా జాతీయ గీతం వేయగా గ్రామంలోని మహిళలు,యువకులు, ఎక్కడివారక్కడ ఉండి సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఇంటి, పొలం పనుల్లో ఉన్నవారు సైతం జాతీయ గీతాలాపనను పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాయిత రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి ,ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ దొనపాటి రామ్ రెడ్డి,ప్రధానోపాధ్యాయురాలు కవిత, అంగన్వాడి టీచర్ స్వరాజ్యం, ఆశా కార్యకర్త నిర్మల, విద్యా వాలంటరీ అనూష , గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page