గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల

Spread the love

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ గోకుల్ ప్లాట్స్ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా గోకుల్ ప్లాట్స్ లో దశల వారిగా అభివృద్ధి చేపడుతామని, గోకుల్ ప్లాట్స్ దశ దిశ మారుస్తామని, అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా గోకుల్ ప్లాట్స్ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. 168 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

పైన పేర్కొన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు బ్రిక్ శ్రీనివాస్ ,గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, పితాని శ్రీనివాస్,సయ్యద్ గౌస్,సంజీవరెడ్డి, నాని, శివాజీ,MD ఇబ్రహీం, రాజు ముదిరాజ్,ఏసుపాదం,రాజేష్,కృష్ణ,ప్రసాద్,వీర రెడ్డి,దుర్గ రావు,వేంకటేశ్వర రావు,శ్రీనివాస్, నారాయణ, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page