గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు

Spread the love

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రేపు జరగనున్న గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గణేష్ నిమర్జనం శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండపం నిర్వాహకులను కోరారు. రాత్రి పది గంటల వరకే నిమర్జనం పూర్తి చేయాలని, విగ్రహాల తరలింపులో డీజెలు పెట్టరాదన్నారు. గణేష్ నిమర్జన ప్రదేశానికి చిన్నపిల్లలను తీసుకురాకుండా చూడాలన్నారు. నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా గణేష్ ఉత్సవాల కమిటీ వారే పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఏసిపి తో పాటు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ,సిఐ కిరణ్, ఎస్సై శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, , హుస్నాబాద్ మున్సిపల్ వర్గం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page