టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టివేత …

Spread the love

టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టివేత …


బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మార్టూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వైజాగ్ నుంచి కర్నాటక రాష్ట్రంలోని బెల్గాంకు జిప్సం లోడుతో వెళుతున్న లారీని టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లారీలో జిప్సంలోడు క్రింద భారీగా గంజాయి మూటలు ఉనట్లు పోలీసులు గుర్తించారు.

లారీలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని, లారితో పాటు ఇద్దరిని స్టేషనుకు తరలించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న గంజాయి షుమారు 180 కిలోలు ఉంటుందని అంచనా. వారం రోజుల క్రితం ఇదే టోల్ ప్లాజా వద్ద కారులో రవాణా చేస్తున్న 140 కిలోలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో మార్టూరు ప్రాంతంలో ముఖ్యంగా జాతీయ రహదారిపై పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన గంజాయికి సంబంధించి పోలీసుల నుండి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page