హాథ్ సే హాథ్ జోడో ప్రారంభం

Spread the love

Hath Se Hath Jodo Beginning

హాథ్ సే హాథ్ జోడో ప్రారంభం

దేశ సమైక్యత, సమగ్రత కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలి

దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను, చరిత్రను మరిచిపోకూడదు

భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా గురువారం హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని ఇంటింటికి తిరుగుతూ హాథ్ సే హాథ్ జోడో ప్రాముఖ్యతను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివరించాలన్నారు.

దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్న 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని ప్రతి పౌరుడికి రాహుల్ గాంధీ సందేశం చేరవేయాలనే ఉద్దేశంతో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని మంథని లో ఘనంగా ప్రారంభించి, సత్యసాయి నగర్ లో ఇంటింటికి తిరుగుతూ హత్ సే హత్ జోడో ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని,

ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితుల్లో జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుందని, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా అనవసరమైన విషయాలను చర్చకు తీసుకువచ్చి సమస్యలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం దేశ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని గాని, దేశ నిర్మాణంలో చేసిన త్యాగాలను చరిత్రను మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ప్రజలను కోరుతూ, ఈ హాథ్ సే హాథ్ జోడో నేటి నుండి 60 రోజులపాటు ప్రతి ఇంటింటికి చేరు విధంగా కొనసాగుతుందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page