ప్రభుత్వ మద్యం దుకాణాలే టార్గెట్ గా దొంగలు చెల్లరేగిపోతున్నారు

Spread the love

Government liquor stores are being targeted by thieves

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలే టార్గెట్ గా దొంగలు చెల్లరేగిపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం గోడను పగలగొట్టి చోరీ చేశారు.అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులను బంధించి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.వైన్ షాప్ వద్ద నైట్ డ్యూటీ చేస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను భయపెట్టి వారిని షాప్ కి కొంత దూరం తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టి అదే సమయంలో మిగిలినవారు మద్యం దుకాణం లో ఉన్న 166 మద్యం సీసాలు కేసులను ఎత్తికెళ్లారు.వాటి విలువ సుమారు రూ.12 లక్షల 35000 ఉంటుందని శ్రీకాకుళం ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ రాధిక ఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page