మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

Spread the love

former-vice-president-venkaiah-naidu-had-a-soulful-gathering-with-friends

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా సత్కరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం స్థానిక జిఎస్ఎల్ హాస్పటల్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పార్టీలకతీతంగా తన స్నేహితులతో ఆత్మీయ సమ్మేళనం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి హాజరయ్యారు. ముందుగా జిఎస్ఎల్ హాస్పిటల్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన క్రేంబ్రిడ్జ్ సీఎంఆర్ వారి రోబెటిక్ అడ్వాన్స్ బయో స్కిట్స్ సెంటర్ ను ప్రారంభించారు.

భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తన ఆత్మీయ మిత్రులందరికీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి విచ్చేశారు. తన మిత్రులందరికీ ఆప్యాయంగా పలకరించి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వెంకయ్య నాయుడు ని ఘనంగా సత్కరించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం మిత్రులందరికీ కలిసి వెంకయ్య నాయుడు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిఎస్ఎల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గన్ని భాస్కరరావు, సిపిఐ మధు, కందుల దుర్గేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page