కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ …

Spread the love


Former MLA and BJP state leaders Srisailam Goud visited Kaleswara Muktiswara Swamy.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ …


సాక్షిత : జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా: ఈరోజు ఉదయం కాళేశ్వరం లోని శ్రీ శ్రీ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు శ్రీశైలం గౌడ్ కి పూర్ణ కుంభ స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందచేశారు.

రాష్ట్రానికి పట్టిన గులాబీ పార్టీ పీడ తొలిగిపోవాలని, తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page