నూతనంగా నిర్మించిన ఏసీ క్లబ్ హౌస్ ను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు

Spread the love

Former corporator Madhavaram Ranga Rao inaugurated the newly built AC Club House

సాక్షిత : వివేకానంద నంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎనక్లేవ్ కాలనీ లో నూతనంగా నిర్మించిన ఏసీ క్లబ్ హౌస్ ను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వడ్డేపల్లి ఎనక్లేవ్ లో నివసిస్తున్న ప్రజలందరికి ఆమోదయోగ్యంగా ఈ ఏసీ క్లబ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇక్కడి ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఈ ఏసీ క్లబ్ హౌస్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు ,వివాహాలు,షష్టిపూర్తి వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా డైనింగ్ హాల్ తో కూడిన క్లబ్ హౌస్ ను నిర్మించుకోవడం చాలా  సంతోషంగా ఉందన్నారు.

క్లబ్ హౌస్ ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో నిర్మించడం గొప్ప విషయం అని, కాలనీ వాసులందరికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. వడ్డేపల్లి ఎనక్లేవ్ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .వివేకానంద నగర్ డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, వడ్డేపల్లి ఎనక్లేవ్ వాసులు PSRK భగవాన్,దశరథ్ రెడ్డి,దేవేందర్, ఫణి, రాము, నాచారయ్య, వెంకట్రావు, సర్పరావు, వెంకటరత్నం, చారీ, శంకరయ్య,ప్రసాద్, నరేంద్ర మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page