విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి

Spread the love

విద్యానగరంలో — విద్యాలయానికి శంకుస్థాపన చేసిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ *
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి
—-ZPTC మందా జక్రి

*
సాక్షిత : జి కొండూరు మండలం జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) మాట్లాడుతూ పేదరికం శాశ్వతంగా నిర్మూలన విద్యతోనే సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ,,అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెద్దపేట వేస్తున్నారని పేర్కొన్నారు._*
జి.కొండూరు మండలం పినపాక శివారు విద్యానగరంలో రూ.25 లక్షల నాడు-నేడు ఫేజ్ 2 నిధులతో నిర్మించనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ నిధులతో పాఠశాల భవనం, ప్రహరీ గోడ, ప్రత్యేకంగా కిచెన్, టాయిలెట్లు, పాఠశాలలో ఫర్నీచర్ తో పాటు సంపూర్ణ మౌలిక వసతులు కల్పించనున్నారు.

విద్యానగరం గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా పాఠశాల భవనం లేక ఇక్కడ విద్యార్థులు చాలా అవస్థలు పడ్డారు. ఇప్పుడు తాజాగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు కృషి కారణంగా ఎట్టకేలకు పాఠశాల భవన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. దీంతో జడ్పీటీసి మందా జక్రి సర్పంచ్ ,ఎంపీటీసీ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page