మునుగోడు ఓటర్లు కాంగ్రెస్ కి ఓటు వేయాలి

Spread the love

మునుగోడు ఓటర్లు కాంగ్రెస్ కి ఓటు వేయాలి – డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

యాదాద్రి భువనగిరి జిల్లా : వరంగల్ & హనుమకొండ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి తో, చౌటుప్పల్ ఒకటవ డివిజన్ ఇంచార్జ్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ జ్యోత్స్న తో కలిసి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు.

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమాలను గుర్తుచేసి పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి తిరిగి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భరోసా ఇచ్చారు

. మునుగోడు యువత మహిళలు విద్యావంతులు మరియు సామాన్య ప్రజలు పేదల పెన్నిధి అయిన పాల్వాయి స్రవంతి ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మరియు తెలంగాణ ప్రజల గొంతుకగా అసెంబ్లీకి పంపించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరారు.

ఈ ప్రచారంలో మహమ్మద్ ఆయూబ్, అంకుస్ స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page