పాలేరు నియోజకవర్గ స్థాయి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్ల పరిశీలన

Spread the love

పాలేరు నియోజకవర్గ స్థాయి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్ల పరిశీలన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పాలేరు నియోజకవర్గ స్థాయి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 5వ తేదీన తిరుమలాయపాలెం మండల కేంద్రం ప్రధాన రహదారి ప్రక్కన గల మైదానంలో జరగనున్న ఈ సమ్మేళన ఏర్పాట్లును పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి మద్దినేని బేబి స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, రామసహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, తిరుమలరావు, కొప్పుల చంద్రశేఖర్, కొడాలి గోవిందరావు, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, సాగర్ తదితర నేతలు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సభకు భారీ సంఖ్యలో శీనన్న అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు అందేవిధంగా ఏర్పాట్లు చేయిస్తున్నారు.

నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పొంగులేటి పర్యటన

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. తదనంతరం సత్తుపల్లి ఎం.ఆర్. గార్డెన్ లో జరిగే రైట్ ఛాయిస్ సెమినారు కు హాజరవుతారని తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page