తెలుగుదేశం పార్టీ కి ఎర్రంనాయుడు సేవలు చిరస్మరణీయం

Spread the love
Errannaidu's services to Telugu Desam Party are memorable

తెలుగుదేశం పార్టీ కి ఎర్రంనాయుడు సేవలు చిరస్మరణీయం ;ఉమామహేశ్వర నాయుడు


సాక్షిత : స్వర్గీయ కింజారాపు ఎర్రం నాయుడు వర్ధంతిని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆయన తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఆదర్శాలకు ఆకర్షితుడై బలమైన బీసీ నేత చంద్రబాబు నాయుడు కి సారధ్యంలో చంద్రబాబు నాయుడు కి ముందు చూపుతో ఆయన ఆలోచనలు పునికి పుచ్చుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సూచనతో ఏమి ఏమి కావాలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం లో సాధించిన బలమైన బీసీ నేతగా ఎదిగినటువంటి ఆయన లేని లోటు మనకు తీవ్రంగా బాధ కలిగించే విషయం.

అయినా కూడా ఆయన ఆశయ సాధన కోసం ఒక బీసీ నేతగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప్రాధాన్యతయిస్తుందో ఎర్రంనాయుడు ని చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయి కానీ తెలుగుదేశం పార్టీ ఎర్రం నాయుడు కి అనేకమైన పదవులు, కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది.

తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని ఎర్రం నాయుడు ని చూస్తే తెలుసుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కాలగర్భంలో కలిపి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తేనే బీసీలకు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని మనుగడ ఉంటుందని తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page