హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ లైన్ పొంగు

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ లైన్ పొంగుతుంది అని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి అధికారులను, జే సి బి మరియు ఏయిర్ టెక్ మిషన్లను తీసుకుని వెళ్లి దగ్గర వుండి పనులను పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదే విధంగా, డ్రైనేజి పైప్ లైన్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు, తగు సూచనలు చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి మేనేజర్ ప్రశాంతి, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు కోనేరు రాగ ప్రసాద్, రవి కుమార్, సూర్యనారాయణ, రాజేష్, సురేష్, గణేష్, కృష్ణ ప్రసాద్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page