SAKSHITHA NEWS

వినుకొండ నియోజకవర్గం పరిధిలోని 10 మంది విభిన్న ప్రతిభావంతులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు

వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గానికి మంజూరైన 10 మంది దివ్యాంగులకు 10 లక్షలు విలువచేసే 10 మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు లబ్దిదారులకు పంపిణీ చేశారు.

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యం అని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు పేర్కొన్నారు.

వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి,వారికి దైనందిక జీవితంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మోటారు వాహనాలను అందిస్తుందని అన్నారు.

విభిన్న ప్రతిభావంతులతో ఎమ్మెల్యే గారు మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులు అందరూ తమ రోజు వారి కార్యక్రమాలను సులభతరం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ మోటార్ వాహనాలను సద్వినియోగం చేసుకుని, జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యే గారు లబ్దిదారులకు సూచించారు.


SAKSHITHA NEWS