ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన కేశినేని శివనాద్ (చిన్ని) మాజీ మంత్రి దేవినేని ఉమా

Spread the love

Devineni Uma, former minister of Keshineni Shivanad (small) pays tribute to NTR

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన కేశినేని శివనాద్ (చిన్ని) మాజీ మంత్రి దేవినేని ఉమా
సాక్షిత : మైలవరం నియోజకవర్గం గొల్లపూడి

ఎన్టీఆర్27వ వర్థంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్ని చేపట్టారు అభిమానులు. జోహార్ ఎన్టీఆర్ అంటూ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు,బొగ్గుల ఇస్త్రీ పెట్టె పంపిణీ చేశారు,అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.

కేశినేని శివనాద్ (చిన్ని) మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.నంద‌మూరి తార‌క రామారావు విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడిగా తెలుగు చిత్ర సీమ‌లో లేని మ‌హారాజుగా ఆయ‌న వెలుగొందారు.

సినీ రంగంలోనే కాకుండా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆయ‌న అన్నారు ఈ సంద‌ర్భంగా కేశినేని శివనాద్ (చిన్ని) మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page