కొటికలపూడిలో రూ.4.22కోట్లతో అభివృద్ధి పనులు

Spread the love

కొటికలపూడిలో రూ.4.22కోట్లతో అభివృద్ధి పనులు

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 6.3.2023.

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.4,22,39,000లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు.

కొటికలపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన సోమవారం సాయంత్రం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం నిర్మాణానికి రూ.40 లక్షలు, పైపులైన్ ఏర్పాటుకు రూ.10లక్షలు, ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.17.50 లక్షలు, రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి రూ.21.80 లక్షలు, నాడు నేడు కింద పాఠశాల భవన నిర్మాణాలకు ఫేజ్ 1కింద రూ.23.40 లక్షలు, అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి రూ.5లక్షలు, సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.62 లక్షలు, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3లక్షలు, పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి రూ.3.65 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధికి ఫేజ్ 2 కింద రూ.41 లక్షలు మంజూరు కాగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

పాలసేకరణ కేంద్రంకు రూ.18.04 లక్షలు, సిమెంట్ రహదారులకు రూ.15.05 లక్షలు, పక్కా రోడ్ల నిర్మాణానికి రూ.16లక్షలు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి పథకానికి రూ.1.39కోట్లు, ఎస్.డబ్ల్యు,పి.సి షెడ్ నిర్మాణానికి రూ.8.50లక్షలు, వీధిదీపాలు ఏర్పాటుకు రూ.3లక్షలు మంజూరు చేశామన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page