అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ సిబ్బందికి, వాలంటీలర్లకు నగదు ప్రోత్సాహకాలు

Spread the love

అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ సిబ్బందికి, వాలంటీలర్లకు నగదు ప్రోత్సాహకాలు

రూ.1.25 లక్షలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామ సచివాలయ పరిధిలో అంకితభావంతో పని చేసిన ప్రభుత్వ సిబ్బందికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు తన స్వంత నిధుల నుంచి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. సచివాలయ సిబ్బందికి రూ.50 వేలు, వాలంటీర్లకు రూ.50 వేలు, డాక్టర్ వైఎస్సార్ కాంతి పథం సిబ్బందికి రూ.25 వేలను చెక్కుల రూపంలో నగదు బహుమతులు అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు జవాబుదారీతనంగా ఇక్కడ సేవలను అందిస్తున్నారని, ఈ విషయాన్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు బుధవారం స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతాల పూర్ణచంద్రరావు సిబ్బంది తరఫున ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page