దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ

Spread the love

దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మావోయిస్టు ప్రభావిత దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్., మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి లతో కలిసి సందర్శించి పోలీస్ స్టేషన్ ల పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది తో మాట్లాడి వారు చేస్తున్న విధుల గురించి, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొన్నారు.

అధికారులతో మాట్లాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల తో మంచి సత్ససంబంధాలు కలిగి ఉండి ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ను పటిష్టం చేసుకోవాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాల గురించి అడిగి తెలుకొన్నారు. ఈ సందర్బంగా సీపీ మేడమ్ మాట్లాడుతూ…. రామగుండం కమిషనరేట్ లో ఉన్నటువంటి అన్ని పోలీసు స్టేషన్ లను సందర్శించి పోలీసు స్టేషన్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ పని చేసినటువంటి అధికారులు, సిబ్బంది తో కలిసి మాట్లాడడం వారి సమస్యలు, వెల్ఫేర్స్ తెలుసుకొడం,n నూతన పోలీస్ భవనాల నిర్మాణాలు ఉంటే వాటి ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని తనిఖీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా దండేపల్లి, జన్నారం పోలీసు స్టేషన్ సందర్శించడం జరిగింది అని దండేపల్లి పోలీస్ స్టేషన్ అనేది చాల చారిత్మక పొలీసు స్టేషన్ ప్రాంతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పొలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతంలో ప్రజల కోసం కమ్యూనిటి కనక్ట్ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులతో చర్చించడం జరిగింది. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతాలను తిరిగి, “గ్రాము పొలీసు అధికారి వ్యవస్థను పటిష్టం చేస్తాం అన్నారు. ఈ ప్రజల కోసం పోలీస్ తరుపున చేసే ప్రతి కార్యక్రమం లో ఈ ప్రాంతంలోని ప్రజల సహకారం ఉండాలి అన్నారు.

ఈ కార్యక్రమం లో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి, ఎస్ఐ దండేపల్లి సాంబ మూర్తి, ఎస్ఐ జన్నారం సతీష్ ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page