నూతనంగా ఏర్పాటు చేసిన “విన్నీ క్యాబిన్ కేఫ్”ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love

నూతనంగా ఏర్పాటు చేసిన “విన్నీ క్యాబిన్ కేఫ్”ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *


సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఇందిరానగర్ లోని వినాయక్ నగర్ మెయిన్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన “విన్నీ క్యాబిన్ కేఫ్” ను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గం ఎంచుకొని ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులైన వినీత్ ను కార్పొరేటర్ అభినందించారు. “విన్నీ క్యాబిన్ కేఫ్”ను ఏర్పాటు చేయడంతో స్థానికులకు అందుబాటులోకి రావడం ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్, గోపాల్ సింగ్, సురేందర్, రవి యాదవ్, కార్తీక్, షీతల్ సింగ్, నిరజ్ సింగ్, సాయి రిషి, ప్రశాంత్ నిర్వాహకులు వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page